అంకన్న గూడెం వీరభద్రవరం వీసా గ్రామసభలు వాయిదా!
సొసైటీ సభ్యులలో ఐక్యత లేకపోవడంతో అడ్డుకున్న గ్రామస్తులు
ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం ఐటీడీఏ పీవో సిద్ధార్థ జైన్ ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం
సీకే న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రతినిధి ప్రశాంత్.
డిసెంబర్ 21
ములుగు జిల్లా( నూగుర్) వెంకటాపురం మండలం అంకన్న గూడెం వీరభద్రవరం ఇసుక సొసైటీ గ్రామసభలు నిర్వహించగా భద్రాచలం ఐ టి డి ఏ పి ఓ సిద్ధార్థ జైన్ ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ముఖ్య అతిథులుగా హాజరైనారు పక్క గ్రామాల నుండి ఇసుక రీచ్ ల కోసం మా గ్రామాలకు వచ్చారు అని స్థానిక ప్రజలు ఆరోపించడంతో నిలిచిపోయిన గ్రామసభలు.
జాయింట్ కమిటీ వేద్దామని తద్వారా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుందామని ఈరోజు సభలు వాయిదా వేసిన పిఓ సిద్ధార్థ జైన్
మండలంలో నడుస్తున్న క్వారీ ల మీద నియంత్రణ లేదు కానీ కొత్త క్వారీలు ఎందుకు అంటున్న స్థానిక ప్రజలు ప్రస్తుతం నడుస్తున్న క్వారీలలో భారీగా అక్రమాలు పాల్పడుతున్నారు
మీడియాను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న సొసైటీ సభ్యులు భారీ యంత్రాలతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, పట్టించుకోని అధికారులు. గ్రామసభలలో మాత్రం నీతులు చెబుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.