నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యాపారం చేయాలి మంత్రి పొంగులేటి స్వీట్‌హోం ఎక్స్‌పోను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టబోదు అని హామీ ఇచ్చారు. వ్యాపారస్తులంతా నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యాపారం చేయాలని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర పరిశ్రమల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఫార్మాసిటీకి బదులు ఐటీ కంపెనీలతో మెగాసిటీ నిర్మిస్తామన్నారు. అంతేకాదు.. మెగాసిటీకి మెట్రోను అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. 3 రోజుల …

నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యాపారం చేయాలి మంత్రి పొంగులేటి

స్వీట్‌హోం ఎక్స్‌పోను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టబోదు అని హామీ ఇచ్చారు.

వ్యాపారస్తులంతా నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యాపారం చేయాలని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర పరిశ్రమల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఫార్మాసిటీకి బదులు ఐటీ కంపెనీలతో మెగాసిటీ నిర్మిస్తామన్నారు.

అంతేకాదు.. మెగాసిటీకి మెట్రోను అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. 3 రోజుల పాటు హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది.

ఆకర్షనీయమైన ఇంటీరియర్, ఫర్నీచర్ మరియు అద్భుతమైన హెూం డెకరేషన్ డిజైన్స్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

ఈ స్వీట్‌హోంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్ధలు తమ స్టాల్స్‌ని ఏర్పాటు చేశాయి. హైటెక్స్‌లో 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్‌పోకి ప్రవేశం ఉచితం.

Updated On 22 Dec 2023 2:38 PM IST
cknews1122

cknews1122

Next Story