అనకాపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య! అనకాపల్లి జిల్లా : ఆర్థిక బాధలు తాళలేక..ఒకే కుటుంబానికి చెందిన ఐదు గురు ఆత్మహత్యకు పాల్పడి న ఘటన అర్ధరాత్రి అనకా పల్లిలో చోటుచేసుకుంది.. ఆర్డ రాత్రి ఓ అపార్ట్మెంట్లో పురుగుల మందు తాగి భర్త భార్యతో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందా రు.మరో 9 ఏళ్ల పాప కుసుమ ప్రియ ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందు తుంది.చికిత్స పొందుతున్న కుసుమ ప్రియా పరిస్థితి నిలకడగా …

అనకాపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!

అనకాపల్లి జిల్లా : ఆర్థిక బాధలు తాళలేక..ఒకే కుటుంబానికి చెందిన ఐదు గురు ఆత్మహత్యకు పాల్పడి న ఘటన అర్ధరాత్రి అనకా పల్లిలో చోటుచేసుకుంది..

ఆర్డ రాత్రి ఓ అపార్ట్మెంట్లో పురుగుల మందు తాగి భర్త భార్యతో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందా రు.మరో 9 ఏళ్ల పాప కుసుమ ప్రియ ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందు తుంది.చికిత్స పొందుతున్న కుసుమ ప్రియా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

అయితే కొడవలి రామకృష్ణ తన భార్య మాధవి దేవి వారి పిల్లలు వేద వైష్ణవి,జాన్వి లక్ష్మి,,కుసుమ ప్రియ తో కలిసి గత కొంత కాలంగా స్థానిక ఫుడ్ పేట,ఫైర్ స్టేషన్ పక్కనలక్ష్మీ పరదేశి అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్లుగా అపార్ట్మెంట్ వాసులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ దాడి మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేప ట్టారు.గుంటూరు తెనాలికి చెందిన రామకృష్ణ కుటుం బం రాత్రి అన్నంలో పురుగు ల మందు కలుపు కొని మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ విషయాన్ని మంగళ గిరిలో ఉంటున్న రామకృష్ణ బంధువులకి సీఐ సమాచా రం చేరవేశారు.మృతు లు భర్త కొడవలి రామకృష్ణ, భార్య మాధవి దేవి,పిల్లలు వేద వైష్ణవి,జాన్వి లక్ష్మి,గా పోలీసులు గుర్తించారు..

Updated On 29 Dec 2023 11:29 AM IST
cknews1122

cknews1122

Next Story