అందరూ దొంగలే”
“ప్రభుత్వాలు మారిన పాలన ఒకటే”
“పోలీస్ శాఖ రికార్డులో ఆధారాలు ఉన్న”
“తమకేమీ తెలియదు అన్నట్టుగా జిల్లా అధికారి తీరు”
“పాసింగ్ కావాలి అంటే లారీలు పక్కన పెట్టడమే”
“సంఘటన స్థలంలో TSMDC సిబ్బంది ఉన్నారు అంటే” ఉన్నారు అంతే”
“ఆధారాలు వచ్చి 24 గంటలు అవుతున్న, ప్రభుత్వ నుంచి”
“ఇప్పటిదాకా సంబంధిత రాంపులపై స్పందన శూన్యం”
“మీడియా అంటే మాకు తెలియనిది కాదు రాష్ట్ర మీడియా ఉన్నత”
“సభ్యులు మా వాళ్లే అనే విధంగా వెంకటాపురం మండలంలో ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్ల మాట తీరు”
“ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
చిన్న వేలిముద్ర సహాయంతో అసాధ్యమైన అనేక రకాల క్రైమ్ లను సైతం అతి తక్కువ సమయంలో సాధ్యం చేస్తూ సాధిస్తున్న తెలంగాణ పోలీస్ శాఖ పనితీరుపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో అనేక అభినందన జల్లులు కురుస్తున్నాయి. కానీ ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ శాఖ ప్రకటించిన ఇసుక ప్రెస్ నోట్ ఆధారం సహాయంతో జరుగుతున్న అక్రమాలను అరికట్టే విధంగా ప్రయత్నించే పనితీరులో ఎందుకు నూతన ప్రభుత్వం విఫలం అవుతుంది కారణం” సమాచారం ఇప్పటిదాకా ప్రభుత్వం దృష్టిదాక అందకపోవడమేనా..!లేక..? మరి ఏమైనా కారణమా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనలు లబ్ధి పొందాలి అన్న ఉద్దేశంతో, ప్రభుత్వాలు తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం పేరుతో గిరిజన బిడ్డలకు, మరియు వ్యవసాయ రంగ రైతు మిత్ర ట్రాక్టర్లకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ ఇసుక సొసైటీలను ప్రవేశపెడితే. స్థానిక బడా బాబులతో రేసింగ్ కాంట్రాక్టర్లు తో చేతులు కలిపి. తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టే విధంగా. స్థానిక బడాబాబులు మరియు ప్రముఖులు అమాయక గిరిజనులను లేనిపోని ఎండమావులు లాంటి ఆశలతో మోసం చేస్తూ. ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తూ ప్రవర్తిస్తున్న తిరు పై. ఇసుక సొసైటీలో జరుగుతున్న అన్యాయాల విషయంలో సొసైటీ సభ్యులు పలు రకాలుగా ఆరోపించినప్పటికీ. ఇటు ప్రభుత్వాలు కానీ అటు మండల అధికారులు కానీ, తమకు ఎందుకులే అనటుగా. ప్రవర్తిస్తున్న తీరు నెలకొంది, ఆధారాలు ఉన్న సంబంధిత అధికారులు జరుగుతున్న అన్యాయాల విషయమై పట్టించుకోకపోవడం పట్ల ముడుపులు అందే ఉంటాయి అన్నట్టుగా ప్రజాస్వామ్యంలో పలు ఆరోపణలు వెల్లడి, పాసింగ్ చాలు మహా ప్రబో అని లారీ డ్రైవర్లు మొరపెట్టుకుంటున్నప్పటికీ” పాసింగ్ కావాలి అంటే లారీ పక్కకు పెట్టడమే అంటూ, టి.ఎస్.ఎం.డి.సి పర్యవేక్షణలో ఉన్నటువంటి, మొర్రివానిగూడెం, కే కొండాపురం, ఇసుక క్వారీల యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరుపై నేరుగా లారీ డ్రైవర్లు మీడియా ముఖంగా సకల ఆధారాలతో ఆరోపిస్తున్నప్పటికీ. తమకేమీ సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్న మండల మరియు జిల్లా మైనింగ్ అధికారులు. సకల ఆదేశాలను సమ్మతపరిచే జిల్లా అధికారి కూడా. తెలిసి తెలియనట్టుగా ప్రవర్తించే తీరుపై సోషల్ మీడియాలో వెలువడుతున్న ఆరోపణలు నిజమే అన్నట్టుగా” జిల్లా అధికారుల ప్రవర్తన. కనీసం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అన్యాలను అరికడుతుందా. ! లేక మాకెందుకులే అనే విధంగా ప్రవర్తిస్తుందా..! అనే విషయం పట్ల సతమతమవుతున్న తెలంగాణ ప్రజలు. మీడియా ముసుగులో చీకటి వ్యాపారాలు చేసే ఆ అజ్ఞాత వాసి ములుగు జిల్లాలో ఎవరు..? ఇదే విషయమై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ పాలనను వ్యతిరేకించే ప్రభుత్వం చే నిషేధింపబడ్డ సంఘాలు ప్రజా పోర్టులో శిక్ష తప్పదు అనే ప్రభుత్వం చేత నిషేధింపబడిన వ్యతిరేక కరపత్రాలకు ఇలాంటి వాళ్లే నిదర్శనమా..? ప్రభుత్వ అధికారులతో కాని, పాలన ములుగు జిల్లా వ్యాప్తంగా కొనసాగించేది ఎవరు.?అనే విషయంపై ములుగు జిల్లా ప్రజలు అయోమయం జగమ్ మయం. కనీసం తెలంగాణ ప్రజలచే ఏకగ్రీవంగా విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా గిరిజనులు లబ్ధి పొందుతారా. లేక గత ప్రభుత్వం లాగానే కల్లబొల్లి కబుర్లతో కొనసాగిస్తారా, అనే విషయంపై తెలంగాణ ప్రజలలో ఒక ప్రత్యేక అంశం వీధివీధికి చక్కర్లు కొడుతుంది.