11 లక్షల విలువగల గంజాయిని పట్టుకున్న పోలీసులు.
- ఆగని గంజాయి రవాణా.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జనవరి 28,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో ఎక్సై జ్ ఇన్స్పెక్టర్ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా ఆ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 11 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
గంజాయి తరలింపుకు ఉపయోగించిన కారును సీజ్ చేశామని తెలియజేశారు. గంజాయిని మల్కాజ్గిరి నుండి దూల్పేట తరలిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఖరీం,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.