డీఎస్సీకి తొలిరోజు 300 దరఖాస్తులు డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. తొలిరోజు 500 మంది ఫీజు చెల్లించగా, 300 మంది దరఖాస్తు చేసుకున్నారు.ఇక డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. పరీక్షా విధానాన్ని సైతం ఖరారు చేసి వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌) మినహా అన్ని స్కూల్‌ అసిస్టెంట్స్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, భాషాపండితులకు 2:30 గంటలపాటు …

డీఎస్సీకి తొలిరోజు 300 దరఖాస్తులు

డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. తొలిరోజు 500 మంది ఫీజు చెల్లించగా, 300 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇక డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.

పరీక్షా విధానాన్ని సైతం ఖరారు చేసి వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌) మినహా అన్ని స్కూల్‌ అసిస్టెంట్స్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, భాషాపండితులకు 2:30 గంటలపాటు పరీక్షను నిర్వహిస్తారు.

ఒక్క స్కూల్‌ అసిస్టెంట్స్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కు మాత్రం మూడు గంటలపాటు పరీక్ష జరుగుతుంది. మిగతా పేపర్లకు 160 ప్రశ్నలు, 80 మార్కులు (ఒక్కో ప్రశ్నకు అరమార్కు) ఉండగా, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఫిజికల్‌ సైన్స్‌కు మాత్రం 200 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి.

డీఎస్సీకి అప్లయ్ చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి నుంచి ఏప్రిల్‌ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది.
మొత్తం 11,062 పోస్టులకు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.

ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీల వివరాలు, ఖాళీలకు సంబంధించిన రోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించే (సీబీటీ) ఈ పరీక్షల తేదీలను ఇంకా వెళ్లడించలేదు. త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొన్నది.

ఈ విషయాలు తెలుసుకోండి

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్‌ పూర్తిచేసినవారే అర్హులు. బీఎడ్‌ వారు పోటీపడేఅవకాశంలేదు.

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు (ఎస్‌ఏ) పోస్టులకు సంబంధిత మెథడ్‌లో బీఎడ్‌ పూర్తిచేసినవారు అర్హులు. నాలుగేండ్ల బీఎడ్‌ పూర్తిచేసినవారు సైతం పోటీపడొచ్చు.
*ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు, యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
· బీఎడ్‌, డీఎడ్‌ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
· అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితికి కటాఫ్‌ తేదీగా 1-7-23ను నిర్ణయించారు. ఈ తేదీలోగా 46 సంవత్సరాలు గలవారై ఉండాలి. కనిష్ఠ వయోపరిమితి 18 ఏండ్లుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5, మాజీ సైనికులకు 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 5, దివ్యాంగులకు 10 ఏండ్ల సడలింపు వర్తిస్తుంది.

Updated On 5 March 2024 2:33 PM IST
cknews1122

cknews1122

Next Story