యాదాద్రి ఈవోపై బదిలీ వేటు సికె న్యూస్ ప్రతినిధి యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణ రావు పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇటీవల సీఎం రేవంత్ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలయంలో పీట మీద కూర్చున్నారు. దీంతో ఆయనకు అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం నెలకొంది. దీనిపై భట్టి కూడా స్పందిస్తూ.. అవమానం లాంటిది ఏమీ లేదని, తానే కింద కూర్చున్నానని చెప్పారు. ఈ క్రమంలో ఆలయ ఈవో పై …

యాదాద్రి ఈవోపై బదిలీ వేటు

సికె న్యూస్ ప్రతినిధి

యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణ రావు పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇటీవల సీఎం రేవంత్ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలయంలో పీట మీద కూర్చున్నారు.

దీంతో ఆయనకు అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం నెలకొంది. దీనిపై భట్టి కూడా స్పందిస్తూ.. అవమానం లాంటిది ఏమీ లేదని, తానే కింద కూర్చున్నానని చెప్పారు.

ఈ క్రమంలో ఆలయ ఈవో పై చర్యలు తీసుకున్నారు. యాదాద్రి ఆలయ నూతన ఈవోగా భాస్కరరావును బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Updated On 14 March 2024 8:40 PM IST
cknews1122

cknews1122

Next Story