
జి ప్లస్ త్రీ నిర్మాణాలు చోద్యం చూస్తున్న అధికారులు.
ప్రజా ప్రభుత్వంలో పాలన ఉందా ?
ప్రజా ప్రభుత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులు స్పందించరా ?
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఆగస్టు 21,
కొత్తగూడెంలో ప్రజా ప్రభుత్వంలో పాలన ఉందా అన్న సందేహం కలుగుతుంది. అనుమతులు లేకుండా బహులాంతస్తుల నిర్మాణాలు చోద్యం చూస్తున్న అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టడాలు చోద్యం చూస్తున్న అధికారులు ప్రభుత్వ స్థలం లో ఇటుక బట్టీల నిర్వహణ చోద్యం చూస్తున్న అధికారులు రెస్టారెంట్ల పై పర్యవేక్షణ లేక భోజన ప్రియులు ఇబ్బందులు చోద్యం చూస్తున్న అధికారులు. నేషనల్ హైవే రోడ్లపైనే సంత నిర్వాహణ చోద్యం చూస్తున్న అధికారులు రోడ్లమీదనే చిరు వ్యాపారాలు వాహనదారులకు ఇబ్బందులు చోద్యం చూస్తున్న అధికారులు. వివరాల్లోకి వెళితే అభివృద్ధి పేరుతో బహుళ అంతస్తులు చుంచుపల్లి మండలం లక్ష్మీదేవి పల్లి మండలం ములకలపల్లి మండలం అన్నపురెడ్డిపల్లి మండలాలలో టీ ప్లస్ త్రీ టు నిర్మిస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రైస్ గ్రాండ్ రెస్టారెంట్ కు ఎటువంటి అనుమతులు లేవని తెలియజేస్తున్న ఆనాటి మున్సిపల్ అధికారులు నేటి కార్పొరేషన్ అధికారులు ఆయన ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోవట్లేదు. రైస్ గ్రాండ్ రెస్టారెంట్లో రెండుసార్లు కుళ్ళిపోయిన బిర్యాని రావడం వారు అధికారులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు సంఘటన జరిగిన తర్వాత తీరిగ్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ రావడం బిరియాని ప్రియులు ఇబ్బందులు పడుతున్న చోద్యం చూస్తున్న అధికారులు. చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్ నేషనల్ హైవే రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నాలుగు సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టారు ప్రభుత్వ స్థలమని అధికారులకు తెలిసిన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు. చండ్రగొండ మండలంలో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలంలోనే ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న పలుసార్లు దినపత్రికలు ప్రచురించినప్పటికీ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీన పరుచుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు. ములకలపల్లి మండలం మెయిన్ రోడ్డు లో జి ప్లస్ త్రీ నిర్మాణం జరుగుతున్న పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు. లక్ష్మీదేవి పల్లి మెయిన్ రోడ్డు పై చాతకొండ వెళ్లే దారిలో జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణలు జరుగుతున్న నోటీస్ ఇచ్చాము అంటూ నిర్మాణా దారులకు సహకరిస్తు చోద్యం చూస్తున్న అధికారులు. చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ పరిధిలో రామ్ నగర్ బ్రిలియంట్ స్కూల్ పక్కన బహులాంతస్తులు జి ప్లస్ త్రీ నిర్మాణం జరుగుతున్న పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు విద్యానగర్ గ్రామ పంచాయతీ ఎదురుగా జి ప్లస్ త్రీ జి ప్లస్ టు నిర్మాణాలు ఎన్ .కె నగర్ లో జి ప్లస్ త్రీ జరుగుతున్న పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు. ఏది అడిగినా ఎవరడిగినా ఒకటే మాట నోటీసులు ఇచ్చాం అంటూ కాలయాపన చేస్తూ నిర్మాణాలు పూర్తి అయ్యే విధంగా సహకరిస్తున్న అధికారులు. గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అధికారుల అండదండల తో జి ప్లస్ త్రీ జి ప్లస్ టు నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు. ఇన్ని జరుగుతున్నా ఒక్క అధికారి కూడా పర్యవేక్షించకపోవడం చర్యలు చేపట్టకపోవడం చూస్తుంటే ప్రజా ప్రభుత్వంలో పాలన ఉందా అని సందేహం వెలిబుచ్చుతున్న ప్రజలు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వంలో పరిపాలన కొనసాగుతుంది అనే విధంగా అధికారులు అక్రమ నిర్మాణాలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి పై చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్న ప్రజలు. చండ్రుగొండ మండలంలో ప్రభుత్వ స్థలంలోనే ఏకంగా ఇటుక బట్టీలు కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్న అధికారులు . పలుసార్లు దినపత్రికలు ప్రచురించినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని స్వాధీర పరుచుకోవాలని కోరుతున్న ప్రజలు.