వైద్యం వికటించి బాలుడి మృతి హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యుల రోదనలు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 16 వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం హుజూర్ నగర్ లో జరిగింది వివరాలకు వెళితేసూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి శిరీష సాయి కృష్ణల కుమారుడు లొడంగి సిద్ధార్థ (5)కు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనాలు అవుతుండగా బాలుడ్ని హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల …

వైద్యం వికటించి బాలుడి మృతి

హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యుల రోదనలు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 16

వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం హుజూర్ నగర్ లో జరిగింది వివరాలకు వెళితే
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి శిరీష సాయి కృష్ణల కుమారుడు లొడంగి సిద్ధార్థ (5)కు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనాలు అవుతుండగా

బాలుడ్ని హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ కి తీసుకొని రాగా బాలునికి చికిత్స చేశారని,వైద్యం వికటించి బాలుడు ఇవాళ ఉదయం చనిపోయాడని తల్లిదండ్రులు తెలిపారు. హుజూర్ నగర్ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు రోదనలతో మిన్నంటాయి.

Updated On 16 March 2024 11:22 AM IST
cknews1122

cknews1122

Next Story