మాజీ ఎం.పీ అనుచరులపై ఆలయ ఈవో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఆలయ ఈఓ రమాదేవి. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, మార్చ్ 30, మూలవరులను ఫోటోలు తీసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం అని ఆలయ ఈ ఓ ఒక ప్రకటనలో తెలిపారు . భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను, ఉపాలయాల్లోని శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారిని, ఆంజనేయ స్వామి వారినీ …

మాజీ ఎం.పీ అనుచరులపై ఆలయ ఈవో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

ఆలయ ఈఓ రమాదేవి.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

మార్చ్ 30,

మూలవరులను ఫోటోలు తీసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం అని ఆలయ ఈ ఓ ఒక ప్రకటనలో తెలిపారు . భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను, ఉపాలయాల్లోని శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారిని, ఆంజనేయ స్వామి వారినీ ఫోటోలు తీసిన వ్యక్తుల పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి తెలిపారు.

మాజీ ఎంపీ, బిజెపి ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ తో పాటు దర్శనానికి వచ్చిన వ్యక్తులు ఫోటోలు తీసినట్లు తెలిసిందని అన్నారు.

సీసీ కెమెరాల ద్వారా ఫోటోలు తీసిన వ్యక్తిని గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫోటోలు తీసిన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Updated On 30 March 2024 6:52 PM IST
cknews1122

cknews1122

Next Story