పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ కీట్స్ పంపిణీ..
అందరిని అల్లాహ్ చల్లగా చూడాలి..
👉పవిత్ర రంజాన్ మాసం పుణ్యాల మాసం…
👉నిరుపేద ముస్లింలకు రంజాన్ కీట్స్ పంపిణీ...
👉 పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో…
*సికే న్యూస్ ప్రతినిధి ఖమ్మం మార్చి 31.;; పవిత్ర రంజాన్ మాసం ఎంతో పుణ్యాల మాసమని, అందరినీ అల్లాహ్ చల్లగా చూడాలని పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ అన్నారు..
.పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో అర్హులైన 45 మంది నిరుపేద ముస్లింలకు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ ఆధ్వర్యంలో రంజాన్ కీట్స్ పంపిణీ చేశారు..
ఈసందర్భంగా పీటర్ నాయక్ మాట్లాడుతూ… రంజాన్ మాసంలో జకాత్, ఫిత్రా రూపంలో దానధర్మాలు చేసే ప్రత్యేక మాసమని… అందుకే ఈ రంజాన్ మాసాన్ని ఈద్-ఉల్-ఫితర్ అంటారని ఆమె అన్నారు..
నిరుపేద ముస్లింలకు రంజాన్ పర్వదినోత్సవం రోజున సేమియా, మరియు భోజన సదుపాయాలకు సంబంధించిన నిత్యావసరాల వస్తువులతో పాటు బియ్యం, సేమియా, డ్రై ఫ్రూట్స్. పంచదార, ఆనియన్స్ డాల్డా, రిఫైండ్ ఆయిల్, వెయ్యి రూపాయల విలువ గల ఒక్కో కిట్ పండుగ సామాగ్రిని 45 మంది నిరుపేద ముస్లింలకు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నారన్నారు
ఇకనుంచి ప్రతి రంజాన్ పర్వ దినోత్సవం రోజున నిరుపేద ముస్లింలకు తనవంతుగా ఆర్థిక సహాయ సహకారాలు ఈపండుగ రూపంలో అందిస్తానన్నారు..
ఈ కార్యక్రమoలో తనను భాగస్వామ్యం చేసిన జర్నలిస్ట్ జానీపాషా,CK న్యూస్ ఛానెల్ చైర్మెన్ భూక్యా ఉపేందర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.. అనంతరం కిట్స్ అందుకున్న నిరుపేద ముస్లిం మహిళలు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు..*