టీడీపీ కార్యకర్త దారుణ హత్య రాష్ట్రంలో అధికారం పోయిన వైసీపీ కార్యకర్తల్లో అధికార మదం పోలేదు. గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలపై ఎన్నోసార్లు దాడులకు పాల్పడ్డారు. హత్యలకు సైతం తెగబడ్డారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వైసీపీ శ్రేణులు బరి తెగింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో దారుణానికి ఒడిగట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్న కోపంతో ఆ పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. దారి కాచి మరీ కొడవళ్లతో దాడి …

టీడీపీ కార్యకర్త దారుణ హత్య

రాష్ట్రంలో అధికారం పోయిన వైసీపీ కార్యకర్తల్లో అధికార మదం పోలేదు. గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలపై ఎన్నోసార్లు దాడులకు పాల్పడ్డారు.

హత్యలకు సైతం తెగబడ్డారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వైసీపీ శ్రేణులు బరి తెగింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో దారుణానికి ఒడిగట్టారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్న కోపంతో ఆ పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. దారి కాచి మరీ కొడవళ్లతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటన వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో జరిగింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిగా గుర్తించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మళ్లీ ఘర్షణలు చోటు చేసుకోకుండా బొమ్మిరెడ్డిపల్లిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Updated On 10 Jun 2024 10:57 AM IST
cknews1122

cknews1122

Next Story