Telangana
Trending

విధులకు ఆలస్యంగా హాజరయిన ఉద్యోగులపై మంత్రి తుమ్మల ఆగ్రహం

విధులకు ఆలస్యంగా హాజరయిన ఉద్యోగులపై మంత్రి తుమ్మల ఆగ్రహం

తన పరిధిలోని శాఖలు మరియు కార్పోరేషన్ల ఉద్యోగుల హాజరుపై సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల

ఉదయం 10.40 గంటల వరకు కూడా విధులకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం

ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటలోపే రిపోర్టు చేయాలని మంత్రి ఆదేశం

హాజరుకాని ఉద్యోగుల నుండి వివరణ తీసుకోవాలని ఆదేశం

రేపటి నుండి విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి – మంత్రి తుమ్మల

ఈ రోజు సచివాలయంలో తన మంత్రిత్వ శాఖ పరిధిలోని శాఖలు మరియు కార్పోరేషన్ల ఉద్యోగుల హాజరుపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఉదయం 10.40 వరకు కూడా తమ విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుకాని ఉద్యోగుల నుండి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుండి ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటలకు వరకు విధులకు హాజరుకావాలని, హాజరుకాని ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులంతా రైతులకు అందుబాటులో ఉండేవిధంగా పనిచేయాలని, రైతులకు కావాల్సిన టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని, పంటలు తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

యూరియా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మంత్రిగారు.. రాష్ట్రానికి వస్తున్న యూరియాను డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాల వారిగా కేటాయించాలని, అలాగే నిన్న జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం వివరాలు త్వరగా సేకరించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ని ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button