ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ (35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వీణకు సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్‌తో 2015లో వివాహం జరిగింది. బీబీపేట మండలం, జనగామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఆమె విధులు నిర్వహిస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యా భర్తలు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీణ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం …

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ (35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

వీణకు సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్‌తో 2015లో వివాహం జరిగింది. బీబీపేట మండలం, జనగామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఆమె విధులు నిర్వహిస్తోంది.

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యా భర్తలు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీణ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

మృతురాలు తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు బీబీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated On 23 Jun 2024 12:32 PM IST
cknews1122

cknews1122

Next Story