ఢాయ్ యాప్ బాధితులు నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వండి మెప్మా పీడీ రాధమ్మ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు పలమనేరు, జూలై 29, ck న్యూస్. పలమనేర్ నియోజకవర్గ పరిధిలో డాయ్ యాప్ బాధితులు నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా, మెప్మా పిడి రాధమ్మ మరియు పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలోని నీలం సంజీవరెడ్డి కౌన్సిల్ హాల్ నందు ప్రజలకు పిలుపునిచ్చారు. మోసం చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని …

ఢాయ్ యాప్ బాధితులు నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వండి

మెప్మా పీడీ రాధమ్మ

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు

పలమనేరు, జూలై 29, ck న్యూస్.

పలమనేర్ నియోజకవర్గ పరిధిలో డాయ్ యాప్ బాధితులు నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా, మెప్మా పిడి రాధమ్మ మరియు పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలోని నీలం సంజీవరెడ్డి కౌన్సిల్ హాల్ నందు ప్రజలకు పిలుపునిచ్చారు.

మోసం చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా, సిఐ చంద్రశేఖర్ మెప్మా పిడి రాధమ్మ తెలియజేశారు.

మెప్మా తరఫున ఎవరెవరు ఈ కేసు నందు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, వారందరి పైన కలెక్టర్ ఆదేశాల ప్రకారం డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని, ఈ సందర్భంగా మెప్మా పిడి రాధమ్మ తెలియజేశారు.

ఈ యాప్ ద్వారా మోసపోయిన బాధితులు చాలామంది వ్రాతపూర్వక కంప్లైంట్ పోలీస్ శాఖ వారు ఇచ్చిన అర్జీలో ఫిలప్ చేసి ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మెప్మా పిడి రాధమ్మ పలమనేర్ సిఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు

Updated On 29 July 2024 1:59 PM IST
cknews1122

cknews1122

Next Story