గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి గౌరవ వందనం చేసి కుటుంబీకులకు మృతదేహం అందజేత చిత్తూరు జిల్లా ,పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, ఆగస్టు 12, సీకే న్యూస్. బైరెడ్డిపల్లి మండలం, గొల్ల చీమనపల్లి గ్రామానికి చెందిన, కొండల రాజారెడ్డి కుమారుడు, కొండల నవీన్, జమ్మూకాశ్మీర్ నందు,ఆర్మీలో,జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడని, ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు, ఆర్మీ అధికారులు, కొండల నవీన్ చేసిన …

గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి

గౌరవ వందనం చేసి కుటుంబీకులకు మృతదేహం అందజేత

చిత్తూరు జిల్లా ,
పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, ఆగస్టు 12, సీకే న్యూస్.

బైరెడ్డిపల్లి మండలం, గొల్ల చీమనపల్లి గ్రామానికి చెందిన, కొండల రాజారెడ్డి కుమారుడు, కొండల నవీన్, జమ్మూకాశ్మీర్ నందు,ఆర్మీలో,జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడని, ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు, ఆర్మీ అధికారులు, కొండల నవీన్ చేసిన సేవలకు, ఆయన మృతదేహం వద్ద కవాతు నిర్వహించి, గౌరవ వందనం చేసారు. అనంతరం అంబులెన్స్లో సొంత గ్రామమైన గొల్ల చీమనపల్లికి మృతదేహాన్ని తరలించగా….
గ్రామం నందు విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated On 12 Aug 2024 6:43 PM IST
cknews1122

cknews1122

Next Story