నేడు హైదరాబాద్‌కు కవిత.. 500 కార్లతో బీఆర్‌ఎస్‌ భారీ ర్యాలీ! తీహార్‌ జైలు నుంచి విడుదలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నేడు హైదరాబాద్‌కు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:40 గంటలకు ఢిల్లీ నుంచి కవిత సహా ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. నేడు 500 కార్లతో భారీ ర్యాలీ : కవిత జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం …

నేడు హైదరాబాద్‌కు కవిత.. 500 కార్లతో బీఆర్‌ఎస్‌ భారీ ర్యాలీ!

తీహార్‌ జైలు నుంచి విడుదలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నేడు హైదరాబాద్‌కు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:40 గంటలకు ఢిల్లీ నుంచి కవిత సహా ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు హైదరాబాద్‌ బయలుదేరనున్నారు.

నేడు 500 కార్లతో భారీ ర్యాలీ : కవిత జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సందడి నెలకొంది.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరుచేసింది. ఈ క్రమంలో తీహార్‌ జైలు నుంచి విడుదల అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..'నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం.

నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్‌ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్‌మెంట్‌తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను.

నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు' అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారు' అంటూ కామెంట్స్‌ చేశారు.

కాగా, జైలు నుంచి విడుదల తర్వాత కవిత.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుకు చేరుకుని మంగళవారం రాత్రి అక్కడే బస చేశారు. ఈ సందర్భంగా కవితను పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

మరోవైపు.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ ఛార్జ్‌షీట్‌పై నేడు ఢిల్లీ ట్రయల్‌ కోర్టులో విచారణ జరుగనుంది. ఈ సందర్భంగా కవిత.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారణకు హాజరుకానున్నారు.

Updated On 28 Aug 2024 10:04 AM IST
cknews1122

cknews1122

Next Story