శ్రీచైతన్య కాలేజీలో ఫుడ్ ​పాయిజన్.. క్యాంపస్లోనే ట్రీట్మెంట్ మాదాపూర్ ​అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీచైతన్య కాలేజీ అక్షర భవన్​క్యాంపస్​లో గురువారం ఫుడ్​ పాయిజన్ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 100 మంది స్టూడెంట్స్​కడుపునొప్పి, విరేచనాలు, జ్వరంతో బాధపడుతుండడంతో కాలేజీ మేనేజ్మెంట్ క్యాంపస్​లోనే గోప్యంగా ట్రీట్మెంట్ అందించింది. తొలుత ఈ విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడింది. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం వారి తల్లిదండ్రులను పిలిపించి మెరుగైన ట్రీట్మెంట్​ కోసం బయటకు పంపించింది. అంతకుముందు అస్వస్థతకు …

శ్రీచైతన్య కాలేజీలో ఫుడ్ ​పాయిజన్.. క్యాంపస్లోనే ట్రీట్మెంట్

మాదాపూర్ ​అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీచైతన్య కాలేజీ అక్షర భవన్​క్యాంపస్​లో గురువారం ఫుడ్​ పాయిజన్ జరిగినట్లు తెలుస్తోంది.

దాదాపు 100 మంది స్టూడెంట్స్​కడుపునొప్పి, విరేచనాలు, జ్వరంతో బాధపడుతుండడంతో కాలేజీ మేనేజ్మెంట్ క్యాంపస్​లోనే గోప్యంగా ట్రీట్మెంట్ అందించింది. తొలుత ఈ విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడింది.

కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం వారి తల్లిదండ్రులను పిలిపించి మెరుగైన ట్రీట్మెంట్​ కోసం బయటకు పంపించింది.

అంతకుముందు అస్వస్థతకు గురైన స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులను బయటకు రానీయకుండా కాలేజీ గేట్లను మూసివేసింది. దీంతో ఏబీవీపీ నాయకులు క్యాంపస్ ముందు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో మాదాపూర్​ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. కాలేజీ మేనేజ్మెంట్​ను వివరణ కోరగా, ఎలాంటి ఫుడ్​ పాయిజన్ జరగలేదని, విద్యార్థులకు వైరల్​ఫీవర్​ వచ్చినట్లు తెలిపారు.

కాలేజీకి రూ.2 లక్షల ఫైన్

మరోవైపు, కాలేజీ క్యాంపస్​ను స్టేట్​ ఫుడ్​ సేఫ్టీ అధికారులు శుక్రవారం సందర్శించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్​కు పంపారు. అలాగే కాలేజీ కిచెన్, క్యాంటీన్​ను జీహెచ్ఎంసీ చందానగర్​సర్కిల్​అధికారులు తనిఖీ చేశారు. ఫైర్ ​సేఫ్టీ, ట్రేడ్​ లైసెన్స్ లేకపోవడంతో రూ. 2లక్షలు ఫైన్ విధించారు.

Updated On 28 Sept 2024 8:56 AM IST
cknews1122

cknews1122

Next Story