రూ. 1.87 కోట్ల విలువ గంజాయి దహనం భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ పరిధిలో 750 కేజీల గంజాయి దగ్ధం. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ), నవంబర్ 06, రూ.1.87 కోట్ల విలువ చేసే 750 కిలోల గంజాయిని బుధవారం దాహనం చేశారు.భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 34 కేసుల్లో పట్టుబ డిన గంజాయిని ఏ డబ్ల్యు ఎం కన్సటింగ్‌ లిమిటెడ్‌ తల్లేడ మండలం గోపాల్‌పేట్‌ గ్రామంలో …

రూ. 1.87 కోట్ల విలువ గంజాయి దహనం

భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ పరిధిలో 750 కేజీల గంజాయి దగ్ధం.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),

నవంబర్ 06,

రూ.1.87 కోట్ల విలువ చేసే 750 కిలోల గంజాయిని బుధవారం దాహనం చేశారు.భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 34 కేసుల్లో పట్టుబ డిన గంజాయిని ఏ డబ్ల్యు ఎం కన్సటింగ్‌ లిమిటెడ్‌ తల్లేడ మండలం గోపాల్‌పేట్‌ గ్రామంలో ప్రభుత్వ అనుమతి పొందిన దహన కేంద్రాంలో గంజాయిని దగ్ధం చేయించారు. గంజాయి దహనానికి ఖమ్మం జిల్లా డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి అదేశాలిచ్చారు.

గంజాయిని దహనం చేసే సమయంలో ఖమ్మం డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి, అసిస్టేంట్‌ కమిషనర్‌ గణేష్‌, భద్రాది కొత్తగూడెం ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ జనాయ్య, భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రహీమ్‌ ఉన్నీషా ఉన్నారు.

గంజాయిని దగ్ధం చేయించిన సిబ్బందిని ఖమ్మం జి ల్లా ఎక్సైజ్‌ పోలీసులను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Updated On 6 Nov 2024 3:35 PM IST
cknews1122

cknews1122

Next Story