తీన్మార్ మల్లన్న కాంగ్రేస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యల కండన వేములపల్లి సీకే న్యూస్ నవంబర్ 05 ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్న ఆదివారం మిర్యాలగూడ బీసి గర్జన సందర్బంగ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి,నల్గొండ కాంగ్రేస్ పార్టీఎంపీ,మంత్రులు,ఎమ్మెల్యే, సీనియర్ నాయకుల పై చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘం నాయకులు తివ్రంగా కండించారు. మల్లన్న కాంగ్రేస్ పార్టీ బీ ఫామ్ పై ఎమ్మెల్సీగ పోటీచేసి కాంగ్రేస్ అగ్ర నాయకుల ప్రచారంతో గెలిసి ఈరోజు హహంకారంతో మాట్లాడే మాటలు తెలంగాణ …

తీన్మార్ మల్లన్న కాంగ్రేస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యల కండన

వేములపల్లి సీకే న్యూస్ నవంబర్ 05

ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్న ఆదివారం మిర్యాలగూడ బీసి గర్జన సందర్బంగ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి,నల్గొండ కాంగ్రేస్ పార్టీఎంపీ,మంత్రులు,ఎమ్మెల్యే, సీనియర్ నాయకుల పై చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘం నాయకులు తివ్రంగా కండించారు.

మల్లన్న కాంగ్రేస్ పార్టీ బీ ఫామ్ పై ఎమ్మెల్సీగ పోటీచేసి కాంగ్రేస్ అగ్ర నాయకుల ప్రచారంతో గెలిసి ఈరోజు హహంకారంతో మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తిన్మార్ మల్లన్న సభలో మాట్లాడిన మాటలు బీసీ సమాజానికి ఎలాంటి సంబంధం లేదని అలాగే స్వంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్న మల్లన్న ను పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలనీ వారు కాంగ్రేస్ అధిష్టానన్ని కోరారు

ఈ కార్యక్రమంలో వేములపల్లి మాజీ ఎంపీటీసీ గంజి శ్రీనివాస్,శెట్టిపాలెం గ్రామ శాఖ అధ్యక్షుడు పల్లా వెంకన్న,వేములపల్లి మాజీ సర్పంచ్ నాగవెల్లి మధు, మంగాపురం మాజీ సర్పంచ్ సుక్క సత్యం,అమనగల్ కాంగ్రేస్ నాయకులు పిల్లల సందీప్,బ్లాక్ కాంగ్రేస్ నాయకులు పేరెల్లి నగేష్,శెట్టిపాలెం యూత్ నాయకులు పల్లా అశోక్,తీమ్మారెడ్డి గూడెం నాయకులు తండు కోటయ్య,నార్ల కంటి సుధాకర్ మరియు బుగ్గవాయగూడెం,రావులపెంట,అన్నపరెడ్డిగూడెం కాంగ్రేస్ బీసీ సంగం నాయకులు పాల్గొన్నారు

Updated On 6 Nov 2024 8:23 AM IST
cknews1122

cknews1122

Next Story