HyderabadPoliticalTelangana

జువైనల్ హోం నుంచి ఐదుగురు బాలురు పరార్

జువైనల్ హోం నుంచి ఐదుగురు బాలురు పరార్

జువైనల్ హోం నుంచి ఐదుగురు బాలురు పరార్.. ఆలస్యంగా వెలుగులోకి..

హైదరాబాద్ సైదాబాద్‌ జైల్‌ గార్డెన్‌లోని జువెనైల్‌ హోం నుంచి ఐదుగురు బాలురు పారిపోయారు. ఈనెల 21న రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా మూడు రోజుల తర్వాత అంటే గురువారం వెలుగులోకి వచ్చింది. 16-17 ఏళ్ల వయసున్న వీరిలో ఇద్దరు ఎపికి చెందినవారు కాగా.. ముగ్గురు తెలంగాణ వాసులు అని తెలుస్తోంది.

రాత్రి డిన్నర్ సమయంలో సిబ్బంది కళ్లుగప్పి ఈ ఐదుగురు బాలురు గ్రౌండ్‌ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకి వెళ్లారు. మొదటి అంతస్థు ఎక్కే సమయంలో వీరి కదలికలు ఎవరికీ కనబడకుండా మరో ఇద్దరు అడ్డంగా నిల్చున్నారు.

దీంతో పథకం ప్రకారం.. మొదటి అంతస్తులోని గేటు తాళం విరగొట్టి పైనుంచి దూకి పారారయ్యారు. బాలుర పరారీపై సంబంధిత అధికారి ఫిర్యాదు మేరకు సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జువైనల్ హోం నుంచి బాలలు తప్పించుకోవడం అనేది హైదరాబాద్ లో తరచుగా వినిపించే మాట. ఇటీవల, సైదాబాద్ జువైనల్ హోం నుంచి 10 మంది బాలలు పరారయ్యారు,

వారిలో నలుగురిని సిబ్బంది ఎట్టకేలకు పట్టుకున్నారు, కాని ఆరుగురు ఆచూకీ తెలియరాలేదు. తప్పించుకున్న వారిలో ఆపరేషన్ ముస్కాన్ లో పోలీసులు రక్షించిన బాల కార్మికులు ఉన్నారని బయటపడింది.

ఈ ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి, సూరారం పరిధిలోని జువైనల్ హోం నుంచి 8 మంది పిల్లలు తప్పించుకున్నారని ఒక నివేదిక తెలిపింది.

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, పోలీసులు తప్పించుకున్న పిల్లల కోసం గాలింపు చర్యలు చేపడతారు, మరికొందరు పిల్లలను పట్టుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ సంఘటనలు జువైనల్ హోం ల భద్రత నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button