HyderabadPoliticalTelangana

వీఆర్వో, వీఆర్ఏలకు శుభవార్త...

వీఆర్వో, వీఆర్ఏలకు శుభవార్త...

వీఆర్వో, వీఆర్ఏలకు శుభవార్త…

భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. యాక్టులో పేర్కొన్నట్లుగా విలేజ్ అకౌంట్ నిర్వహించేందుకు ఊరికొకరిని విలేజ్ లెవెల్ ఆఫీసర్లను నియమించనుంది.

ఈ మేరకు పూర్వపు వీఆర్వోలకు ఆప్షన్లు ఇస్తూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 10,954 రెవెన్యూ గ్రామాలకు వీరి నియామకం జరగనుంది. అలాగే.. సర్వేయర్లుగా పనిచేసేందుకు సైతం వారికి ఆప్షన్ ఇచ్చారు.

28లోపు ఆప్షన్లకు అవకాశం

గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి వీఆర్వోలందరినీ లాటరీ పద్ధతిన వివిధ శాఖలకు, కార్పొరేషన్లకు బలవంతంగా పంపారు. కొందరినైతే తాత్కాలిక ఉద్యోగులుగా మార్చగా.. ఏండ్ల తరబడి ఎలాంటి వేతనం లేకుండా పనిచేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు.

కొత్త చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్‌ను నియమిస్తున్నట్లు సీసీఎల్ఏ ప్రకటించింది. ఎవరైతే తిరిగి రెవెన్యూ శాఖకు రావాలనుకుంటున్నారో వారందరికీ ఆప్షన్లు ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను రూపొందించారు.

https:// docs.google.com/forms/d/e/1FAIpQLSdMb0_y0V7euTUq-cD4Xj5uiml1-QGALCiYeCB2T3TxU9ApLw/viewform ఈ ఫారం ద్వారా పూర్తి వివరాలను సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందులో విలేజ్ లెవెల్ ఆఫీసర్లతోపాటు సర్వేయర్‌గా పనిచేసేందుకు కూడా చాన్స్ ఇచ్చారు.

ఆప్షన్ల ద్వారా పూర్వ వీఆర్వోల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు? ఏ శాఖలో ఉన్నారు? ఎంప్లాయి ఐడీ? ప్రస్తుత పోస్టులో నియమించబడిన తేదీ? రెవెన్యూ శాఖలో చేరిన తేదీ? విద్యార్హతలు, ఏ జిల్లా? ఏ జిల్లాలో పని చేయాలనుకుంటున్నారు? ఇలాంటి వివరాలను అడిగారు. సర్వేయర్‌గా పనిచేయాలనుకుంటే తప్పనిసరి డిగ్రీ లేదా ఇంటర్(ఎంపీసీ) చదివి ఉండాలన్న షరతు విధించారు. ఈ నెల 28వ తేదీలోపు ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు.

పొంగులేటి ప్రకటించినట్లుగానే..

రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలోనే ప్రకటించారు. వివిధ శాఖల్లోకి సర్దుబాటైన వీఆర్వోలు, వీఆర్ఏల్లో ఎంపికచేసిన వారిని మళ్లీ 10,954 రెవెన్యూ గ్రామాల్లో నియమిస్తామన్నారు. వారితోపాటు మరో వెయ్యి మందిని సర్వే సెటిల్‌మెంట్ విభాగంలోకి తీసుకుంటామని తెలిపారు.

ఆర్వోఆర్ యాక్ట్ 2024 ప్రకారం తాత్కాలిక భూధార్, శాశ్వత భూధార్, భూధార్ కార్డుల జారీ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, దరఖాస్తుల పరిశీలన, వీలునామా, వారసత్వ విషయంలో మ్యుటేషన్‌లో విచారణ, సెక్షన్ 13 ప్రకారం గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, నిర్ణయించిన రీతిలో హక్కుల రికార్డుల తుది ప్రచురణ తర్వాత అమలు చేయాలి.

ధరణి పోర్టల్‌లో తప్పొప్పుల సవరణతోపాటు అసలే నమోదు కాకుండా పార్టు బి కింద పేర్కొన్న సుమారు 18 లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సి ఉంది. ప్రభుత్వం పార్టు బి కింద పేర్కొన్న వాటిని ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేయాలని నిర్ణయించింది.

భూ సమస్యల స్థితి, స్థాయిని బట్టి ఎవరు పరిష్కరించాలనే దానికి త్వరలోనే గైడ్‌లైన్స్ ఇవ్వనుంది. కోర్టు కేసులు మినహా మిగతా భూముల డేటాను పరిశీలించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం గ్రామ రెవెన్యూ సిబ్బంది అవసరం తప్పనిసరి అయింది.

నిండకపోతే.. వీఆర్ఏలు?

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల సంఖ్యకు అనుగుణంగా పూర్వపు వీఆర్వోలు రాకపోతే ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఆ ఖాళీ పోస్టుల్లో వీఆర్ఏలకు కూడా చాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే.. ఇప్పటికే డైరెక్ట్ రిక్రూట్‌లో డిగ్రీ, పీజీలు చేసిన వారు ఉన్నారు. వీఆర్వోల్లోనూ విద్యార్హతల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వీఆర్ఏల్లోనూ గ్రాడ్రుయేట్స్ ఉన్నారు. ఈ నియామకాల్లో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారో వేచి చూడాలి.

ఫలించిన పోరాటం

వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థలను ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేయడంతోపాటు లాటరీ పద్ధతిన వివిధ శాఖలకు పంపారంటూ చాలా కాలంగా ఉద్యోగులు పోరాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ తిరిగి తీసుకొస్తామంటూ హామీ ఇచ్చారు.

భూ భారతిలోనూ గ్రామీణ పరిపాలన అనివార్యంగా చేశారు. ఈ క్రమంలోనే ఆప్షన్ల ద్వారా తిరిగి తీసుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ పూర్తిగా కలెక్టర్ల ద్వారానే పూర్తి చేయనున్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై టీజీఆర్ఎస్ఏ హర్షం

భూభారతి చట్టంలో భాగంగా రాష్ట్రంలో గ్రామానికో రెవెన్యూ అధికారి రానున్నారని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌ (టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం పేర్కొన్నారు.

అందులో భాగంగానే వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి ఆప్షన్లను కోరుతూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి కృషి ఫలితంగానే సాధ్యమైందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!