వైద్యం వికటించి మహిళ మృతి ? ఓ ఆర్ఎంపీ వైద్యానికి ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఎల్లారెడ్డిపేట మండలం గంభీరావుపేట మండలంలో తురకాశి పల్లెలో చోటుచేసుకుంది. తురకాశి పల్లెకు చెందిన షేక్ కాశింబీ (35) రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురి కాగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యునికి చూపించారు. అతను రెండు రోజుల పాటు వచ్చీరాని వైద్యం చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట …
![వైద్యం వికటించి మహిళ మృతి ? వైద్యం వికటించి మహిళ మృతి ?](https://cknewstv.in/wp-content/uploads/2024/12/IMG-20241228-WA0015-1.jpg)
వైద్యం వికటించి మహిళ మృతి ?
ఓ ఆర్ఎంపీ వైద్యానికి ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఎల్లారెడ్డిపేట మండలం గంభీరావుపేట మండలంలో తురకాశి పల్లెలో చోటుచేసుకుంది.
తురకాశి పల్లెకు చెందిన షేక్ కాశింబీ (35) రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురి కాగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యునికి చూపించారు. అతను రెండు రోజుల పాటు వచ్చీరాని వైద్యం చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
దీంతో కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు గత రాత్రి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
కాగా మహిళా మృతికి కారణమైన సదరు ఆర్ఎంపీ వైద్యుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన పై స్థానిక ఎల్లారెడ్డి పేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ విచారణ చేపట్టినట్లు సమాచారం.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)