ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. 50 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలో ఏసీబీ దాడి.. రూ.50వేలు లంచం తీసుకుంటున్న మండలం సర్వేయర్ మెరుగు రత్నం ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు దమ్మపేట మండలం గాంధీనగరంలో ఓ వ్యక్తి నుండి మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఖమ్మంలో నివాసముండే మద్దినేని వెంకట్ కు దమ్మపేట మండలంలో పొలాలు …

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..

50 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలో ఏసీబీ దాడి..

రూ.50వేలు లంచం తీసుకుంటున్న మండలం సర్వేయర్ మెరుగు రత్నం ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

దమ్మపేట మండలం గాంధీనగరంలో ఓ వ్యక్తి నుండి మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

ఖమ్మంలో నివాసముండే మద్దినేని వెంకట్ కు దమ్మపేట మండలంలో పొలాలు ఉన్నాయి. తన చెల్లెలుకు సంబంధించిన పొలం పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోగా, సర్వే పూర్తి చేసిన సర్వేయర్ వెంకటరత్నం రిపోర్ట్ తన దగ్గరే ఉంచుకొని లక్షా యాభై వేలు డిమాండ్ చేశాడు. అంతమొత్తం తమవద్ద లేదని, రూ.50 వేలకు ఒప్పందం చేసుకుని బాధితుడు మద్దినేని వెంకట్ ACB ని ఆశ్రయించాడు.

ఫిర్యాదు స్వీకరించిన ACB డీఎస్పీ వై. రమేష్ టీం మండలంలోని గాంధీ నగరంలో మాటువేసి సర్వేయర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచగొండి సర్వేయర్ ను అరెస్టు చేసి వరంగల్ కోర్టుకు తరలించారు.

తన రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నప్పటికీ నెంబర్లు తేడాలు ఉన్నాయంటూ.. తన మ్యాపులో లేదంటూ నెల రోజులుగా తిప్పుతూ డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు పేర్కొన్నారు.

రెవెన్యూ పై కనీసం నాలెడ్జి లేని వ్యక్తి ఆరేళ్లుగా సర్వేయర్ గా ఇక్కడ పనిచేస్తున్నాడని, ఎవరు ఏ పని కోసం వచ్చినా సకాలంలో పనులు చేయకుండా విసిగించేవాడని ఫిర్యాదుదారుడు తెలిపాడు. డబ్బులు డిమాండ్ చేస్తూ రైతుల కష్టాన్ని కొల్లగొడుతుండటంతో విసిగిపోయి ఏసీబీ నాశ్రయించానని వెంకట్ తెలిపాడు.

Updated On 28 Dec 2024 9:21 PM IST
cknews1122

cknews1122

Next Story