డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడుల కలకలం…
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడుల కలకలం… ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు టాలీవుడ్లో కలకలం రేపుతోన్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు.ఈ తెల్లవారు జాము నుంచి ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి. రెండోరోజు కూడా హైదరాబాద్లో పలుచోట్ల ఈ ఐటీ దాడులు సాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, …
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడుల కలకలం…
ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు టాలీవుడ్లో కలకలం రేపుతోన్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు.ఈ తెల్లవారు జాము నుంచి ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి.
రెండోరోజు కూడా హైదరాబాద్లో పలుచోట్ల ఈ ఐటీ దాడులు సాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఈ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రెండో రోజు కూడా హైదరాబాద్లో ఐటీ సోదాలు ముమ్మరం అయ్యాయి. శ్రీవేకంటేశ్వర క్రియేషన్స్తో మొదలైన ఈ తనిఖీలు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. ఆయా నిర్మాణ సంస్థలు సినిమాలకు పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తోన్నారు.
ఇప్పుడు తాజాగా పుష్ప-2 దర్శకుడు సుకుమార్ కూడా ఐటీ రాడార్లోకి వెళ్లిపోయారు. ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు చేపట్టారు.
పుష్ప 2 సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ సహా ఆయనకు ఉన్న ఆదాయ వనరుల గురించి ఆరా తీస్తోన్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. సుకుమార్ను ఎయిర్పోర్ట్లోనే పికప్ చేసుకున్నట్లు సమాచారం.
ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత దిల్ రాజునే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ రెండూ తెరకెక్కాయి.
మూడు రోజుల వ్యవధిలో విడుదల అయ్యాయి. ఈ నెల 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి.
ఈ రెండు సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
పుష్ప 2ను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు సుకుమార్ 15 కోట్ల రూపాయల మొత్తాన్ని రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన ఆదాయపు పన్నులను ఆయన చెల్లించారా? లేదా? అని ఐటీ అధికారులు ఆరా తీస్తోన్నట్లు చెబుతున్నారు.