
జి ప్లస్ త్రీ కి అండగా నిలిచిన మండల అధికారులు.
చర్యలు తీసుకొని ఎంపీ ఓ పై చర్యలు తీసుకోవాలి.
నోటీసులకి పరిమితమైతే చర్యలు తీసుకునేది ఎవరు?
జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారులు.
గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు.
జి ప్లస్ త్రీ నిర్మాణానికి సహకరించిన ఎంపీ ఓ సెక్రెటరీలపై చర్యలు తీసుకోవాలి.
4 నుండి 5 సంవత్సరాలుగా ఒకే దగ్గర పోస్టింగ్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి ప్రతినిధి,
మే 29,
అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపరెడ్డిపల్లి మండలంలో జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాల జోరు మండల పంచాయతీ అధికారుల అండదండలతో నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి.
గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ జి ప్లస్ త్రీ నిర్మాణాలు పూర్తికావచ్చినాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న మండల అధికారులు. నోటీసులు అందజేశాము అంటూ ప్రత్యక్షంగానే అక్రమ నిర్మాణదారుల కు సహకరిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా నోటీసులు ఇస్తూనే ఉన్నారు. అసలు అక్రమ నిర్మాణాలు జరిగేటప్పుడు పంచాయతీ మండల అధికారులు నిర్మాణ దారులకు నోటీసులు అందజేస్తారు మరి ఎన్ని నోటీసులు అందజేస్తారు. తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్నది ఇక్కడ సమస్యగా మారింది.
ఎవరు అడిగినా నోటీసులు అందజేశాము అంటున్నారు తప్ప తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంతుచిక్కని ప్రశ్న. జి ప్లస్ త్రీ నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ ప్రారంభోత్సవం కూడా పూర్తి అయ్యే విధంగా సహకరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అంత పెద్ద భవనం పూర్తి కావస్తుంది అంటే మండలాధికారుల అండదండలు లేవంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అక్రమ నిర్మాణాలని ఆపాల్సిన అధికారులు వారికి అండగా నిలబడుతూ జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తయ్యే వరకు సహకరిస్తున్నారు.
ఇంత పెద్ద అక్రమ నిర్మాణం జరుగుతున్న ఎంపీ ఓ కు కానీ పంచాయతీ కార్యదర్శి కానీ కనిపించ లేదంటారా లేదా ఇంకా ఏమైనా జరిగింటుందా అని చర్చించుకుంటున్న ప్రజలు. జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణానికి సహకరించుతున్న ఎంపీ ఓ పంచాయతీ కార్యదర్శిల పై చర్యలు తీసుకోవాలి అని కోరుతున్న ఆదివాసి నాయకులు ప్రజలు. అనుమాతులు లేకుండా నిర్మాణం మొదలుపెట్టిన మొదలుకొని జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తికావచ్చేవరకు అనగా కొన్ని నెలలుగా నిర్మాణం జరుగుతున్న అడ్డుకోకుండా ఏం చేస్తున్నట్టు తెలియాల్సిన ప్రశ్న.
ఈ మధ్యనే అక్రమ నిర్మాణాలు భద్రాచలంలో కూలి అమాయకులు బలైన సంఘటన కళ్ళముందే కదలాడుతుంది. నేడు అన్నపరెడ్డిపల్లిలో పునరావృత్తం అయితే పరిస్థితి ఏంటి. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. మండల పంచాయతీ అధికారులు చేయవలసిన పనులు చేయకుండా జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ వారి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యే విధంగా సహకరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమే లేదు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి జి ప్లస్ త్రీ నిర్మాణ దారులకు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని ఎంపీ ఓ సెక్రెటరీ లపై ర్యలు తీసుకోవాలి నిర్మాణాలను నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్న ప్రజలు.