
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి…
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన పెనుబల్లి మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజారా లోజాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో స్కూటీని లారీ బలంగా ఢీ కొట్టడంతో పంచాయతీ కార్యదర్శి బాణోత్ సోనాలి (33) అక్కడికక్కేడే మృతి చెందింది. మృతురాలి పై నుండి లారీ వెళ్ళటంతో శరీర భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి.
మృతురాలు పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తుంది. కల్లూరు మండలం నుండి విధులకు హాజర్ అవ్వటానికి స్కూటీ పై పెనుబల్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ సంఘటన పై స్థానిక పెనుబల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.