
ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లోనూ అజయ్ మ్యాథ్స్ గైడెన్స్ లో విద్యార్ధుల టాప్ ర్యాంక్స్
తిరుపతి
ఫోరం ఫర్ ఆర్టీఐ సెక్రటరీ, సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్ కుప్పాల.అజయ్ ప్రసన్న కుమార్ గైడెన్స్ లో ఆల్ ఇండియా ప్రతిష్టాత్మకమైన జె ఈ.ఈ ఎంట్రన్స్ 2025లో ఇటీవల సక్సెస్ ఐన విధంగానే,నిన్న వెలువడిన
ఎంసెట్ EAPCET _2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కూడా, ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో కె.సంతోష్ ఆంధ్రా స్టేట్ 34 వ ర్యాంక్ సాధించటం గమనార్హం.అంతే కాకుండా ఏప్రిల్ నెలలో అనౌన్స్ చేసిన ఆల్ ఇండియా ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్ ర్యాంక్స్ లో కూడా వి. రామ్ చరణ్ 778 వ ర్యాంక్, కె. సంతోష్ 12,702 సాధించటం విశేషం.అజయ్ గైడెన్స్ లో శిక్షణ తీసుకున్న విద్యార్ధులు అందరూ ఇంజనీరింగ్ విభాగంలో జేఈఈ, డీమ్డ్ యూనివర్సిటీస్, మరియు స్టేట్ యూనివర్సిటీస్ లో డొనేషన్ లేకుండా, మంచి పర్సెంటైల్, మంచి ర్యాంక్లు,క్వాలిఫై అయ్యి ఫ్రీ సీట్స్ తెచ్చుకోవటం కూడా గొప్ప విషయం.ముఖ్యంగా టాప్ నాలెడ్జ్ స్టూడెంట్స్ తో మాత్రమే కాకుండా యావరేజ్ స్టూడెంట్స్ కూడా సక్సెస్ అవుతుండటానికి కారణం, రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యే ఏ మంచి సబ్జెక్ట్ గల ఉపాధ్యాయులు క్లాసెస్ లో స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే ఏకాగ్రతతో వింటూ,రోజు రోజుకు కొన్ని కొత్త కాన్సెప్ట్స్ తెలుసు కుంటూ, బట్టీ లేకుండా ఈజీ షార్ట్ కట్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ, అనుభవజ్ఞులు, టాలెంట్ కల్గిన లెక్చరర్స్ ఇచ్చే హోమ్ వర్క్ మోడల్స్ క్రమ పద్ధతిలో మ్యాథ్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ టెక్నిక్స్ తెలుసుకుంటే విజయం మన సొంతం అని అజయ్ మీడియా ముఖంగా తెలియచేశారు. అజయ్ మాట్లాడుతూ పెద్ద పెద్ద మెటీరియల్ అంతా భట్టి కొట్టాలి అనే వత్తిడి లేకుండా తన దగ్గర మ్యాథ్స్ గైడెన్స్ తీసుకున్న, మా విద్యార్ధులు అందరూ సి బి ఎస్ సి,ఇంటర్మీడియట్ మ్యాథ్స్ రెండు పేపర్స్ లో 100% పాస్ అవ్వటమే కాకుండా, అన్నిరకాల ఇంజనీరింగ్ యూనివర్సిటీ లలో మంచి ర్యాంక్స్ తో,ఫ్రీ సీట్స్ తెచ్చుకోవటం, విద్యార్ధుల తల్లి తండ్రులకు డొనేషన్ కట్టే భారం లేకుండా చేస్తూ ఉండటం,తన ప్రొఫెషనల్ ఆశయం అని అజయ్ అన్నారు.