
అరకపట్టి…! పొలం దున్ని…!!
- కూసుమంచిలో ఏరువాకకు మంత్రి పొంగులేటి శ్రీకారం
- రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి
కూసుమంచి : రైతుల శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజవర్గం పర్యటనలో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలో జరిగిన ఏరువాక కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. అరక పట్టి పొలం దున్నారు. రైతు సోదరులకు, మహిళా కూలీలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ఈ ఏడాది మంచి వర్షాలు పడి పాడిపంటల ఎగుమతిలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.
కూసుమంచిలో ఏరువాక కార్యక్రమం అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్
అమితంగా ప్రేమించే పాలేరు నియోజకవర్గ రైతన్నలు ఏర్పాటు చేసుకున్న ఏరువాక కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉంది…
రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగాలం కష్టపడి దేశ ప్రజలను ఆహార భద్రత కల్పించే రైతులకు ఏరువాక శుభాకాంక్షలు..
ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తరువాత అన్ని సంక్షేమ కార్యక్రమాలు తో పాటు రైతు ను రాజు చేయాలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయిన ఈనాడు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం ఇస్తుంది
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్ది తో పని చేస్తోంది
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇబ్బంది లేకుండా సప్లై చేసేందుకు ప్రణాలికలు సిద్ధం చేసింది
ఆనాటి ప్రభుత్వ పెద్దలు వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలు పెట్టి వదిలేస్తే వాటిని పూర్తి చేస్తూ సాగు నీటిని అందిస్తాం..
అభగవంతుని దయతో ఈ సంవత్సరం పదిహేను రోజుల ముందు నైరుతి రుతుపవనాలు పలకరించాయి
వ్యవసాయ సీజన్ కూడా మొదలయింది
వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం రేపటి నుంచి 12 వేలు ఇస్తాం..
రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం
ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే 18 నెలల్లో నే 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాం
రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఇచ్చాము రేపటి నుంచి మూడోసారి ఇస్తాం
వరేస్తే ఉరి అని ఆనాటి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పేడితే రైతు పక్షపాత ప్రభుత్వం గా ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది..
కాళేశ్వరం కూలిపోయిన తరువాత కూడా దేశంలో ధాన్యం పండించిన రాష్ట్రంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం
ఉచిత కరెంటు, రైతు భరోసా ,నాణ్యమైన విత్తనాలు లాంటి కార్యక్రమాలు ప్రణాళిక బద్దంగా చేస్తున్నాం
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుంది
రాష్ట్రంలో రైతులు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని మంత్రి పొంగులేటి తెలిపారు