
ఢిల్లీలో రాష్ట్రపతి, ఎన్ఐఏ డైరెక్టర్ ద్వారా అవార్డులు పొందిన పలమనేరు విద్యార్థులు
పలమనేరు జూన్ 23 సి కె న్యూస్
నిన్న ఢిల్లీలో రాష్ట్రపతి విజ్ఞాన్ భవన్లో జరిగిన సీఎంఏ కాన్వకేషన్ లో పలమనేరు కు చెందిన రిషబ్ ఆల్ ఇండియా 1 వ ర్యాంకు మరియు శశి శ్రీనివాస్ ఆల్ ఇండియా 11 ర్యాంక్ సాధించిన సందర్భంగా రాష్ట్రపతి మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జనరల్ డైరెక్టర్(NIA) సదానందచే ఈ అవార్డులు అందుకోవడం జరిగింది
ఈ ఇద్దరు విద్యార్థులు ఎల్కేజీ నుండి సీఏ సీఎం ఏ వరకు 8 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి కలకత్తా చెన్నై ఢిల్లీ వంటి నగరాలలో ప్రముఖులచే సన్మానాలు పొందారు
ఇప్పుడు ఇద్దరూ మంచి కంపెనీలలో ఇంటర్వ్యూలలో పోటీని తట్టుకొని ఉద్యోగాలు సంపాదించారు. ఇద్దరూ మంచి ర్యాంకులు సాధించడం పట్ల పలమనేరు ప్రముఖులు శ్రేయోభిలాషులు ప్రశంసించారు