
పూరీ జగన్నాథుడి రథయాత్రలో విషాద ఘటన… తొక్కిసలాటలో ముగ్గురు మృతి…
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయితే పూరీ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా ఒక విషాద సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల ప్రాంతంలో శ్రీ గుండిచా ఆలయం ముందు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి పోటెత్తారు.
ఈ క్రమంలోనే అక్కడ తోపులాట జరిగింది. దీంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
గాయపడిన వారిని వెంటనే పూరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు.ఆలయం వద్దకు చేరుకునే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో గందరగోళం ఏర్పడిందని చెబుతున్నారు.
అయితే అప్పటికే రద్దీ ఎక్కువగా ఉందని… ఒక ట్రక్కు జనంలోని రావడంతో మరింత గందరగోళ, భయాందోళన పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితిని అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన తదుపరి దర్యాప్తు జరుగుతోంది.