
గురుకుల విద్యార్థుల భోజనంలో పురుగులు
జగిత్యాల – వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలోని బీసీ గురుకుల హాస్టల్ విద్యార్థులకు పురుగులు పట్టిన భోజనం
పాఠశాలకు సందర్శనకు వెళ్లిన ఓ విద్యార్థి తండ్రి పురుగుల భోజనం చూడడంతో బయటకు పొక్కిన విషయం
ఈ విషయమై వివరణ కోరగా.. ప్రతీరోజు బియ్యం శుభ్రం చేసిన తర్వాతే వండుతామని, ఆదివారం కావడంతో అధ్యాపకులు అందరూ సెలవులో ఉన్నారని, అందుకే పర్యవేక్షించలేదని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపిన ప్రిన్సిపాల్
నాసిరకం బియ్యం పాఠశాలలకు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.