Telangana

పట్టపగలే పీకల దాకా తాగి పడిపోయిన టీచర్…

పట్టపగలే పీకల దాకా తాగి పడిపోయిన టీచర్…

పట్టపగలే పీకల దాకా తాగి పడిపోయిన టీచర్…

పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతులు.. పట్టపగలే పీకల దాకా తాగి పడిపోయాడు. చదువు చెప్పేవారు లేక పిల్లలంతా బిక్క మొహం వేశారు. ఈ ఘటన కొమురం భీమ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జైనూర్ మండలం సుకుద్‌పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో SGTగా పనిచేస్తున్న విలాస్ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తరగతి గదిలోకి వచ్చి పిల్లలకు చదువు చెప్పకుండా టేబుల్‌ దగ్గర పడిపోయాడు. ఇదంతా గమనించిన గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారులు విచారణ చేపట్టారు. అధికారుల నివేదికతో SGT విలాస్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button