
నేడు (జూలై 30) ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్..!
హైదరాబాద్ : ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్రాజ్ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరుకానున్నారు.
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈ నెల 21న ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ప్రకాష్ రాజ్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రి వరకు ఆయన నుంచి ఈడీ అధికారులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది.
దీంతో విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ను ఈడీ రిజిస్టర్ చేసింది.
లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చారు.
ఈ క్రమంలోనే విచారణకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న రానా దగ్గుబాటి హాజరు కావాల్సి ఉండగా.. ముందస్తు సినిమా షూటింగ్ కారణంగా సమయం కోరాడు.
వచ్చే నెల 6న విచారణకు హాజరు కావాల్సిన విజయ్ దేవరకొండ కూడా సమయం ఇవ్వాలని అడిగాడు. దీంతో వీరిద్దరిని ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది.