
అధికార లాంఛనాలతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు
విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య(24) అంత్యక్రియలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో ఆదివారం నిర్వహించారు.
ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సౌమ్య కుటుంబ సభ్యులకు రూ.కోటి పరిహారం, ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
ఆదివారం సౌమ్య మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడికి వెళ్లిన మంత్రి జూపల్లి.. అలాగే ప్రభుత్వం తరఫున ఆమె కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆమె సొదరుడికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు.
ఇటీవల నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ శాఖ అధికారుల గుర్తించారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన అధికారులతోపాటు ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆమెను వాహనంతో ఢీ కొట్టి ఆ గంజాయి ముఠా పారిపోయింది.
తీవ్ర గాయాలతో ఉన్న తనను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తన ఆరోగ్యం విషమించడంతో తప్పనిసరి పరిస్థితిలో ఓ కిడ్నీని వైద్యులు తొలగించారు. ఆయిన తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు.
నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రెండు, మూడు రోజులు చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. శనివారం ఆమె ప్రాణాలతో పోరాడి మరణించింది. ఉద్యోగంలో చేరిన ఏడాది కాలంలోనే ఇలా జరగడం బాధకరమైన అంశం.
సౌమ్య మృతిపై తెలంగాణ మెుత్తం బాధపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ గంజాయి ముఠాకు శిక్ష పడుతుందని హామీ ఇచ్చారు. ఆమె కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా (x) వేదికగా సీఎంవో ప్రకటించింది. మంత్రి జూపల్లి కూడా ఈ విషయంపై స్పందించారు. సౌమ్య కుటుంబాన్ని పరామర్శించి తగిన న్యాయం చేస్తామని ధైర్యం తెలిపారు. ఆయన తన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కోటి రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.
అలాగే ఆమె సోదరుడి ప్రభుత్వం తరఫున ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో సౌమ్య కుటుంబానికి ఒక్కరోజు జీతం ఇచ్చి అండగా నిలిచిన ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
తమ ప్రభుత్వం కూడా ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల రక్షణ కల్పించే ప్రయత్నాలపై ఆలోచన చేస్తుంది. ప్రభుత్వంతో మాట్లాడి ఆయుధాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సౌమ్య మృతిపై రాష్ట్ర స్థాయి నాయకులు కూడా స్పందించారు.
బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గంజాయి ముఠాల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజకీయ నాయకులు విమర్శించారు.




