
కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరిన BRS ఎమ్మెల్యే..
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆసిఫాబాద్ BRS ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహనం కోల్పోయారు. కాంగ్రెస్ నేతపై చేతికి దొరికిన వాటర్ బాటిల్తో విరుచుకుపడ్డారు.
ఎమ్మెల్యే కోవా లక్ష్మి టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్పై విసిరేశారు.
రేషన్ కార్డుల పంపిణి సందర్భంగా ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వివాదం నెలకొంది. కొమరంభీం జిల్లా జన్కపూర్లో ఆగస్ట్ 7(గురువారం) రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అధికారులు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రవర్తనతో అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు.
కొమరంభీం జిల్లా జన్కపూర్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహనం కోల్పోయి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై విరుచుకు పడ్డారు.
రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమం అని అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని కాంగ్రెస్ నాయకులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే కోవా లక్ష్మి కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్పై వాటర్ బాటిల్స్ విసురుతూ రెచ్చిపోయారు.
చేతికి ఏది దొరికితే అది విసురుతూ దాడి చేశారు. అది మీడియా వీడియోలో రికార్డ్ చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రేషన్ కార్డుల పంపిణీ గవర్నమెంట్ ప్రోగ్రాం అని.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దని ఎమ్మెల్యే లక్ష్మి ప్రసంగాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆమె అధికారుల, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.