
ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు.. తల్లితో గొడవ ఆపై విద్యార్ధి ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన విద్యార్థిని తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది.
జగిత్యాల లోని లింగంపేటకు చెందిన విష్ణువర్ధన్ (15) స్థానికంగా ఉన్న స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.
తరచు ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండడంతో వాటికి దూరంగా ఉండాలని ఇటీవల తల్లి మందలించింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన విష్ణువర్ధన్ మంగళవారం క్షణికావేశంలో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.