
కే టి ఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని భారీ ర్యాలీ…
రైతులతో రాస్తారోకో నిర్వహించిన ఆదివాసీ నవనిర్మాణ సేన..
రైతులు చనిపోతే కేటిఆర్ కు కన్నీళ్లు ఎందుకు రాలేదని ప్రశ్నించిన.. ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి..
కలెక్టర్ జోలికి వస్తే BRS ని ఏజెన్సీ లో రెడ్ బుక్ లో పెడతాం అని హెచ్చరిక..
కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం..
కలెక్టర్ చిత్ర పటానికి పాలాభిషేకం..
బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల చేత మోస పోయి నష్టపోయిన రైతులకు ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇప్పిస్తే కలెక్టర్ ని పింక్ బుక్ లో పెడతావా అని కేటీఆర్ పైన ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఏజెన్సీ ఆదివాసీ రైతులకు, ప్రజలకు న్యాయం చేసే అధికారుల పైన ఇలాంటి దుర్మార్గపు పనులకు ఒడి కడతారా.. అధికారం పోయినా మార్పు రాలేదా అని కొర్స నర్సింహా మూర్తి విమర్శించారు.
కలెక్టర్ పైన అనుషిత వ్యాఖ్యలు చేసిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల కే టి ఆర్, గుదవర్తి నర్సింహా మూర్తికి వ్యతిరేకంగా గురువారం ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో వెంకటాపురం మండల కేంద్రంలో రైతులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించి, గంట సేపు రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
రాజకీయ విమర్శలు అధికార ప్రతిపక్ష పార్టీల పైన చేసుకోండి మాకేం ఇబ్బంది లేదన్నారు. కానీ చేసే దివాకరా టి ఎస్ లాంటి అధికారుల పైన కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. ప్రజలు అధికారం ఇస్తే అధికారుల పైన కక్ష కట్టడం దిక్కుమాలిన చర్య అన్నారు.
బహుళ జాతి విత్తనోత్పత్తి కంపెనీలను అడ్డు పెట్టుకొని ఏజెన్సీ రైతులను ఆర్ధికంగా దోపిడి చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించి రైతుల ఆత్మహత్యలకు కారణం అయిన దళారీ మాటలు మీకు కన్నీళ్లు తెప్పించాయా అని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కే టి ఆర్ పైన కొర్స నర్సింహా మూర్తి మండిపడ్డారు.
బహుళజాతి కంపెనీల మోసాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆదివాసీ రైతుల విషయం లో మీకు ఎందుకు కన్నీళ్లు రాలేదని ఆయన బిఆర్ పార్టీని, కే టి ఆర్ ని నిలదీశారు. గుదవర్తి నర్సిం మూర్తి ఏజెన్సీ రైతులను కోట్ల రూపాయలకు ముంచినందుకు కే టి ఆర్ అతని ముందు శిరస్సు వంచి నమస్కరించారా ప్రశ్నించారు.
బాధ్యతా యుతమైన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ప్రజల పక్షాన నిజాయితీ గా పని చేసిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకరా టి ఎస్ పై ఇలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితువు పలికారు. జిల్లా కలెక్టర్ ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి అని తెలియజేసారు.
ఆదివాసీ గూడెల్లో పాఠశాలలు, వైద్య సదుపాయం లేకపోతె కంటైనర్ పాఠశాలలు, కంటైనర్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసి విద్యా వైద్య సదుపాయాలు అందిస్తున్న కలెక్టర్ ని ఏదైనా చేయాలనీ చుస్తే ప్రజలు మరోసారి స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్తారని అన్నారు. ప్రజలు ఓడించినా ఇంకా మీకు బుద్ది రాలేదా అని ఏద్దేవా చేసారు. అధికారం లో ఉన్నప్పుడు ఆదివాసీల పైన దమన కాండ కొనసాగించిన బి ఆర్ ఎస్ పార్టీ..అధికారం పోయినా ఆదివాసీల పైన అక్కసు పోలేదని అన్నారు.
ఆదివాసీల పక్షాన పని చేసిన కలెక్టర్లు బి డి శర్మ, ఎస్ ఆర్ శంకరణ్, విపి గౌతమ్, ప్రవీణ్ ప్రకాష్, గిరిధర్ , యోగితా రానా, దివ్య దేవరాజన్ లను ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారని ఈ సందర్బంగా గుర్తు చేసారు. ములుగు జిల్లా కలెక్టర్ గా వచ్చిన దివాకరా టి ఎస్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు.
యావదు ఆస్తిని పార్టీకి దారదత్తం చేస్తానని అంటున్న ఆర్గనైజర్ మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం కింద ఇస్తే బాగుంటుందని అన్నారు. 1/70 చట్టం వలస గిరిజనేతరులకు ఏజెన్సీ లో ఎటువంటి హక్కు ఇవ్వలేదని, వలస గిరిజనేతరులకు ఏజెన్సీ లో ఆస్తి హక్కు రద్దు అయిందని అన్నారు.
ఆస్తి హక్కు రద్దు అయినప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడివి అని ఆయన ప్రశ్నించారు. ఎల్ టి ఆర్ చట్టాన్ని ఉల్లాంఘించి వందల ఎకరాల భూములు కబ్జా చేసి బి ఆర్ ఎస్ కు దార దత్తం చేస్తే ఆదివాసీలు ఊరుకోరని హెచ్చరించారు.
రైతులకు న్యాయం జరగడానికి కలెక్టర్ దివాకరా టి ఎస్ తో పాటు వ్యవసాయ మంత్రి తుమ్ముల, జాతీయ ఎస్టీ కమిషన్ జాటోత్ హుస్సేన్, రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా మంత్రి సీతక్క అని రైతులు తెలిపారు. కలెక్టర్ చిత్ర పటానికి రైతులు మహిళలు పాలాభిషేకం చేసారు. కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసారు. కే టి ఆర్ డౌన్, డౌన్ అని నినాదాలు చేసారు.
కే టి ఆర్, గుడవర్తి నర్సింహా మూర్తి రైతులకు, కలెక్టర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, గుదవర్తిని తక్షణమే పార్టీ నుండి బహిస్కరించాలని డిమాండ్ చేసారు. గుదవర్తి యావదస్తీ పైన ఆస్తుల పైన సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినారు.
జిల్లా అధ్యక్షులు కుంజ మహేష్, మండల అధ్యక్షులు ముర్రం రాజేష్, వాజేడు మండల అధ్యక్షులు మోడెం నాగరాజు, వాసం నారాయణ, ఇసుక సహకార సంఘాల జిల్లా అధ్యక్షులు ముర్రం రామలక్ష్మి, నాయకులు పద్మ, చిలకమ్మా, సుశీల, అపర్ణ, కాక రాజు, ఇర్ప బాబు రైతులు, ఆదివాసీ ఇసుక సహకార సంఘాల మహిళలు, ప్రజలు యువత పాల్గొన్నారు..