
వనంవారికిష్టాపురం హైస్కూల్లో చెట్టుపై పడిన పిడుగు…
విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం..
సి కె న్యూస్ చింతకాని ప్రతినిధి.
_
ముదిగొండ మండల పరిధిలోని వనంవారి కిష్టాపురంలోని సోమవారం అకస్మాత్తుగా వర్షం కురవడంతో హైస్కూల్లోని గిన్నెపండు చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడి నిలువుగా చీలిన చెట్టు.
దీంతో ఒక్కసారిగా హైస్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులు భయాందోళనతో కేకలు వేశారు. అ సమయంలో హైస్కూల్లో ఉన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు దీంతో గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు._



