
ధ్వంసమైన రహదారుల దుస్థితి ప్రభుత్వానికి తెలిసేలా బీఆర్ఎస్ డిజిటల్ క్యాంపెయిన్
జిల్లాలో ధ్వంసమైన రహదారులను తీరుతెన్నులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తగూడెం – ఖమ్మం మార్గంలోని జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండా వద్ద ధ్వంసమైన ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. ఆ రహదారులు ధ్వంసమైన తీరు కన్పించేలా సెల్ఫీలు దిగి ప్రసార మాధ్యమాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. ధ్వంసమై, గుంతలమయమై ప్రమాదభరితంగా ఉన్న రహదారులకు వెంటనే ఈ మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొన్నారు