
పేకాటరాయులపై, టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
అక్టోబర్ 21 (సీ కే న్యూస్) చేగుంట
చేగుంట / మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సమాచారం ఆధారంగా మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు చేగుంట పట్టణ పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి నిర్వహించారు, ఈ దాడిలోమొత్తం 8 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు,
వారి వద్ద నుండి రూపాయలు 58,060 రూపాయల నగదు మరియు 7 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు, నిందితుల నుంచి మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను చేగుంట పోలీస్ స్టేషన్ కు అప్పగించి కేసు నమోదు చేయడం జరిగింది,
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి వి శ్రీనివాసరావు, మాట్లాడుతూ పేకాట జూదం వంటి అక్రమాల కార్యకపాలకు పాల్గొనే వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు, ప్రజలు ఇలాంటి వాటికి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వారు తెలిపారు,