
పెబ్బేరు ఫర్టిలైజర్ షాప్ లో చోరీ
పెబ్బేరు అక్టోబర్30 (సి కే న్యూస్)
పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని మహేష్ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. షటర్ తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు.
కాష్ కౌంటర్లో ఉన్న రూ.5 వేలు నగదు దొంగతనం చేసినట్లు యజమాని శంకర్ తెలిపారు. దొంగతనం చేసి అక్కడే ఉన్న కుండలో నీళ్లు తాగి, మూత్ర విసర్జన చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డు అయ్యాయి.
షాప్ యజమాని నీలం శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు
 
				




