
మద్యానికి బానిసైన కొడుకు.. కూల్డ్రింక్లో పురుగుల మందు కలిపిన తండ్రి
మద్యానికి బానిసైన కొడుకును వదిలించుకోవడానికి ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కొడుకుకు మద్యంలో పురుగుల మందు కలిపి తాగించాడు.ఈ అమానుష ఘటన ఖమ్మం జల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం కలకొడెమ గ్రామానికి చెందిన ఆదూరి రాజేష్ ఆదూరి నాగరాజు ఇద్దరు తండ్రి కొడుకులు.
నాగరాజుకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అప్పటి నుండి తండ్రి కొడుకులు ఇద్దరు మందుకు బానిసయ్యారు. గత కొంతకాలంగా తండ్రి కొడుకులు మద్యం సేవిస్తూ గొడవ పడుతుండగా నాగరాజు తండ్రిని కొడుతుండేవాడు.
ఎలాగైనా తన కొడుకు అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న తండ్రి రాజేష్ గత నెల 20వ తేదీ దీపావళి రోజున బ్రాందీ తీసుకొచ్చి దాంట్లో పురుగులమందు కలిపి కొడుకును తాగమని చెప్పాడు. నాగరాజుకు విషయం తెలియక బ్రాందీ తాగాడు. దీంతో అస్వస్థకు గురైన అతన్ని ఖమ్మం హాస్పిటల్కి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తుండగా అక్టోబర్ 31వ తేదీన సాయంత్రం నాగరాజు (17) మృతి చెందాడు.
నాగరాజును తండ్రి రాజేష్ చంపాడని మృతుడు పెద్దమ్మ తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తల్లాడ రెండవ ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.




