EducationKhammamKotthagudemNotificationPoliticalTelangana

గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వీటీజీ–సెట్ 2026 అప్లికేషన్ గడువు పొడిగింపు

సి.కే న్యూస్ ప్రతినిధి నరసింహ ఏన్కూరు జనవరి 22 2026:రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం పొందేందుకు నిర్వహించనున్న వీటీజీ – సెట్ 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించి అప్లికేషన్ గడువును పొడిగించినట్లు ఏన్కూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేము రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ లోగా తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే అప్లికేషన్ నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఉన్న పొరపాట్లను సవరించుకునేందుకు కూడా ఈ నెల 25వ తేదీనే చివరి గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు.

గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్య, వసతి, భోజనం, శిక్షణ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో విద్యార్థులకు ఇది మంచి అవకాశమని ప్రిన్సిపాల్ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని, సందేహాల నివృత్తి కోసం సమీప గురుకుల పాఠశాలలను సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ వేము రాజు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button