
మేడారం జాతరలో ఒక్కసారిగా కూలిన నేమ్ బోర్డ్…
లైటింగ్ నేమ్ బోర్డు మీద పడటంతో భక్తుడికి గాయాలు
మేడారంలో అధికారుల నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు తెచ్చింది. హరిత వై-జంక్షన్ దగ్గర లైటింగ్ నేమ్ బోర్డు కిందపడటంతో ఎడ్ల నర్సయ్య అనే భక్తుడికి గాయాల య్యాయి.
ఈ ఘటనలో ఒక భక్తుడికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన సమయంలో అక్కడ భక్తులు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
జంపన్న వాగు నుంచి గద్దెలకు వెళ్లే రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. మేడారం జాతరకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతమైతే పరిస్థితి ఊహించలేము అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. మరోవైపు పోలీసులు రంగంలోకి దిగారు. లైటింగ్ బోర్డు కింద పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మేడారం లోపల అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం బయటపడింది. హరిత వై జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ఘటనలో భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మేడారం జాతరకు లక్షల మంది భక్తులు తరలివస్తారు. జనం ఎక్కువగా వచ్చే ఇటు వంటి ప్రాంతంలో అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అయితే, ఈ ఘటనలో అధికారుల నిండు నిర్లక్ష్యం కనిపిస్తుంది. జాతరకు ఘన స్వాగతం అంటూ భారీ హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేశారు కానీ.. భక్తుల సేఫ్టీ గురించి మాత్రం మరిచిపోయారు.
సైన్ బోర్డ్ ను జాగ్రత్తగా నిలిపారా లేదా అన్నది పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. భారీ హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో మరిపెడకు చెందిన ఓ భక్తుడు హోర్డింగ్ లోపల చిక్కుకుపోయాడు. ఆర్తనాదాలు పెట్టాడు.
అక్కడ భారీ హోర్డింగ్ ఎవరు ఏర్పాటు చేశారు? ప్రభుత్వమా, ప్రైవేట్ వ్యక్తులా? అంత పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేసినప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి కదా అని భక్తులు నిలదీస్తున్నారు. అధికారుల వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు.



