NizamabadPoliticalTelangana

కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా

కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా

కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా

నిజామాబాద్ నగర శివారులో రూట్ వాచ్ ఆపరేషన్ సమయంలో గంజాయిస్ ముఠా ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యకు అతి దారుణంగా కారుతో ఢీ కొట్టిన సంఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది.

శుక్రవారం సాయంత్రం సుమారు 6:45 గంటల సమయంలో, నిజామాబాద్ పట్టణానికి ఎండుగంజాయి (డ్రై గంజా) తరలింపు జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంపై ఆధారపడి, నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీఐ ) ఆమె సిబ్బందితో కలిసి పట్టణ పరిధిలోని మాధవనగర్ ప్రాంతంలో రూట్ వాచ్ నిర్వహించారు.

ఆపరేషన్ సమయంలో ఒక కారును తనిఖీ కోసం ఆ వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేయగ ఆ వాహనం ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యను ఢీకొట్టింది.

దీంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

సంఘటన సమాచారం అందిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్య పరీక్షల అనంతరం, కానిస్టేబుల్ జి. సౌమ్యకు అంతర్గత పొట్ట గాయాలు అయినట్లు నిర్ధారణ అయ్యింది.

ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనను నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించబడింది.

సంఘటనకు సంబంధించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అదనంగా, వాహనం నుంచి సుమారు 2 కిలోగ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button