
గ్రీన్ ఫీల్డ్ హైవే పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని లింగాల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన కొమ్ము సాయి(35), గట్టు రాంబాబు(32) ఖమ్మం వస్తుండగా, కల్లూరు మండలంలోని లింగాల గ్రామ సమీపానికి రాగానే వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి రెయిలింగ్ ఢీకొట్టింది.
అప్పటికే వేగంగా ఉండటంతో ఇద్దరూ ఎగిరి రహదారిపై పడటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఎస్సై హరిత ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.



