
గర్భం దాల్చిన కస్తూర్బా విద్యార్థిని
కేజీబీవీ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది.
ఊట్కూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (ఎంపీహెచ్డబ్ల్యూ) ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది.
ఓ ఆటో డ్రైవర్ సదరు విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. గత నెల 9న స్కూల్కు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థిని తిరిగి పాఠశాలకు హాజరుకాలేదు.
ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించగా.. గర్భందాల్చినట్టు తేలింది. దీంతో కుటుంబ సభ్యులు సదరు యువకుడిని నిలదీశారు.



