
కోట్ల రూపాయలతో ఇల్లందు మున్సిపల్ ను అద్భుతంగా మలుస్తున్న…
మున్సిపల్ ను అద్భుత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా… కొండపల్లి సరిత గణేష్
గత పాలకులు పట్టణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు…
అడిగిన అన్ని పనులు ఇవ్వకుంటే నిలదీయండి…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించండి…
గౌరవ ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య..
ఇల్లందు మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు అభ్యర్థిని కొండపల్లి సరిత ను మన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలనని ఓటర్లను అభ్యర్థించినరు..
జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓటు
ఈ సందర్భంగా మాట్లాడుతూ మన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుత పాలనను అందిస్తున్నారని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచారని రైతు రుణమాఫీ సన్నబడ్లకు బోనస్, ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు, ఉచిత కరెంటు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు.
9 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసింది శూన్యమని ఇల్లందు నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో బ్రష్టు పట్టించారని ఇల్లందు మండలం పై సమితి తల్లి ప్రేమను చూపారని గత పాలకులు కేవలం ఆస్తులు సంపాదించుకునేందుకే అధికారంలోకి వచ్చారని.
తాను అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే ప్రజల కోరిక మేరకు నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న మని తెలిపారు.
సిసి రోడ్లు డ్రైనేజీలు తోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నానని, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియగా ముందుకు సాగుతామని ఇల్లందు పట్టణం నిరంతర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఇప్పటికే పట్టణాన్ని రెండు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు.




