
ఓటేయాలేదని ఎన్నికల ముందు ఇచ్చిన నగదు, చీరలు వసూలు
మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎం.జ్యోతి ఎన్నికల ముందు ప్రజలకు పంపిణీ చేసిన నగదు, చీరలను తిరిగి వసూలు చేశారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆమె బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
దీంతో జ్యోతి కుటుంబ సభ్యులు పొన్నాల గ్రామంలో శనివారం ఇంటింటికీ తిరిగి చీరలు, డబ్బులు వసూలు చేసినట్లు స్థానికులు తెలిపారు.
తమకు ఎవరు ఇవ్వమన్నారని, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు.



